రాజకీయ వార్తలు

కోనసీమ అల్లర్ల కేసుల విషయంలో జగన్ కీలక నిర్ణయం!

కోనసీమ అల్లర్ల కేసుల విషయంలో జగన్ కీలక నిర్ణయం!

  • కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో చెలరేగిన అల్లర్లు
  • కేసులు ఎత్తివేయాలని జగన్ నిర్ణయం
  • అందరూ కలిసిమెలిసి ఉండాలనే యోచనతోనే నిర్ణయం తీసుకున్నామన్న సీఎం

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో అమలాపురంలో భారీ హింస చెలరేగిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు విశ్వరూప్, పొన్నాడ సతీశ్ ల ఇళ్లకు కూడా దుండగులు నిప్పు పెట్టారు. రాళ్ల దాడులు, బస్సుల దహనం వంటివి కూడా చోటు చేసుకున్నాయి. దీంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి.

ఈ క్రమంలో తాజాగా ఈ కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులపై కేసులు ఎత్తి వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో జరిగిన ఘటనను అందరూ మరిచిపోయి, కలిసిమెలిసి ఉండాలనే యోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు కేసులను ఎత్తి వేయాలనే నిర్ణయం తీసుకున్న జగన్ కు కోనసీమ నేతలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Related posts

నన్ను చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు!

Drukpadam

గులాబీ బాస్ మీటింగ్ … ఏమి చెబుతారోననే ఉత్కంఠ !

Drukpadam

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త చీఫ్.. గిడుగు…

Drukpadam