Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎవరితో పొత్తులేదు ..వీలినంలేదు …43 స్థానాల్లో ఫోర్స్ గా ఉన్నాం ..షర్మిల

ఈ రోజు నేనెవరో తెలియని వారు లేరు.. 43 స్థానాల్లో మేం గట్టి ఫోర్స్: వైఎస్ షర్మిల

  • ఎవరితోను పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పిన షర్మిల
  • విలీనం చేయాలనుకుంటే పార్టీ పెట్టకపోయేదానినని వ్యాఖ్య
  • తనకు పొత్తులపై మిస్డ్ కాల్స్ వస్తున్నాయన్న షర్మిల

వైయస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని గత రెండుమూడు రోజులుగా వస్తున్న వార్తలపై ఆపార్టీ చీఫ్ షర్మిల స్పందించారు . పార్టీని మరో పార్టీలో వీలీనంలో చేసేందుకు పార్టీ పెట్టలేదని తేల్చిచెప్పారు. అంతే ఏపార్టీ పొత్తు కూడా ఉండదని స్పష్టం చేశారు . పొత్తు కోసం , విలీనం కోసం ఇంత కష్టపడాలా…అనేక వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలా అని అన్నారు . కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు . తమ పార్టీ 43 స్థానాల్లో ఫోర్స్ గా ఉందని ఇది నేను చెప్పే మాట కాదని ఒక సర్వే రిపోర్ట్ అని ఆమె పేర్కొన్నారు .

 

పొత్తులపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. అంతేకాదు, తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనుకుంటున్నట్లుగా వచ్చిన కథనాలను ఆమె కొట్టి పారేశారు. తమది పేదలు, నిరుద్యోగుల కోసం పోరాడే పార్టీ అన్నారు. తాము ఎవరితోను పొత్తులు పెట్టుకునే ఆలోచన చేయడం లేదన్నారు. విలీనం గురించి మాట్లాడుతూ…. విలీనమే చేయాలనుకుంటే తాను పార్టీని ఎందుకు పెడతానని, పార్టీ పెట్టి రెండేళ్లుగా ఎందుకు కష్టపడుతున్నానని, పాదయాత్ర ఎందుకు చేస్తున్నానని ప్రశ్నించారు. తాను చేరుతానంటే వద్దనే పార్టీ ఉన్నదా.. అప్పుడే ఏ పార్టీలో చేరని తాను, ఇప్పుడు విలీనం ఎందుకు చేస్తానని ప్రశ్నించారు.

తన తండ్రి వైఎస్ పేరు మీద పార్టీ పెట్టి, నిజాయతీగా పాదయాత్ర చేశానని చెప్పారు. ఒత్తిళ్లకు లొంగకుండా, బెదిరింపులకు లొంగకుండా లోకల్ ఎమ్మెల్యేల అవినీతి గురించి మాట్లాడానని చెప్పారు. ఈ రోజు షర్మిల అంటే తెలియని వారు తెలంగాణలో లేరన్నారు.

ఢిల్లీ సంస్థ ఒకటి సర్వే చేస్తే 43 స్థానాల్లో తమ పార్టీ గట్టి ఫోర్స్ అని తేలిందని చెప్పారు. ఈ లెక్కలు తాను చెప్పడం లేదని, ఢిల్లీ సంస్థ చేసిన సర్వే అన్నారు. ఇలాంటి సమయంలో పదికో, ఇరవైకో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి.. అన్ని పార్టీలు పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తాయన్నారు. పొత్తుల కోసం తనకు కూడా మిస్డ్ కాల్స్  వస్తున్నాయని చెప్పారు. అయితే తాము చార్జింగ్ మోడ్ లోనే ఉన్నామన్నారు. తెలంగాణలో కేసీఆర్ పార్టీని ప్రజలు బొంద పెడతారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు అయినా వస్తాయా అని ఎద్దేవా చేశారు.

Related posts

బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణమన్న కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన హరీశ్ రావు

Drukpadam

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి: శశిథరూర్…

Drukpadam

కాంగ్రెస్ పార్టీ నేతలకు అధినేత్రి సోనియా గాంధీ వార్నింగ్!

Drukpadam

Leave a Comment