25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు: బండి సంజయ్..!
- కాంగ్రెస్ పార్టీని పెంచేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారన్న సంజయ్
- 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారని ఆరోపణ
- అవినీతిపరులను మోదీ ప్రభుత్వం వదలదని వ్యాఖ్య
బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తి ..సంచలన వ్యాఖ్యలకు మరు పేరు …25 మంది బీఆర్ యస్ ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు . గతంలో కూడా అనేక మంది బీఆర్ యస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని చెప్పారు . కానీ అది జరగలేదు .బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం విఫలమైంది . నాటి బీఆర్ యస్ ,బీజేపీ మధ్య దోబూచులాట మాటల యుద్ధం జరుగుతుంది. కేసీఆర్ ను జైల్లో పెట్టిస్తానని అన్నారు . కవిత లిక్కర్ స్కాం లో జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు. కానీ ఏది జరగలేదు ..కేటీఆర్ అనేక మంది బీజేపీ కార్పొరేటర్లు తమకు టచ్ లో ఉన్నారని అనడంతో దానికి ప్రతిగా బండి సంజయ్ ఎమ్మెల్యేల అంశం తీసుకోని వచ్చారనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన చెప్పారు. బీజేపీ కార్పొరేటర్లు తమతో టచ్ లో ఉన్నారని కేటీఆర్ అంటున్నారని… బీఆర్ఎస్ మాదిరి తాము రాజకీయ వ్యభిచారం చేయమని అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారు పదవులకు రాజీనామా చేసిన తర్వాతే వారిని బీజేపీలోకి చేర్చుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని పెంచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని… 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రతి నెలా డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు.
హిందువుల గురించి తాను మాట్లాడుతూనే ఉంటానని… తన వల్లే బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా భాగ్యలక్ష్మి ఆలయం బాట పట్టాయని సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశాన్ని ఇవ్వాలని… కేసీఆర్ కుటుంబ సభ్యులు సహా అవినీతికి పాల్పడిన వారందరినీ జైలుకు పంపిస్తామని చెప్పారు. అవినీతిపరులను మోదీ ప్రభుత్వం వదలిపెట్టదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పారు.