Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

పురందేశ్వరీ.. ఒక్క క్షణం ఆలోచించమ్మా: విజయసాయిరెడ్డి ట్వీట్

  • అబిడ్స్ లో ఇంటిని నాలుగు కోట్లకు అమ్ముకున్నారని విమర్శ
  • దానిని కొని మీ నాన్న గారి జ్ఞాపకార్థంగా ఉంచలేకపోయారేమని ప్రశ్న
  • ఎన్టీఆర్ కు సమాధి తప్ప స్మారకమంటూ లేకుండా చేశారని ఫైర్
  • తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో ఉండాలి.. పేపర్లు, టీవీ ప్రకటనల్లో కాదని సెటైర్

‘దివంగత నేత, మహా నటుడు ఎన్టీఆర్ ఆశయాలకు గండికొట్టారు.. సమాధి తప్ప ఆయనకు స్మారకచిహ్నమంటూ లేకుండా చేశారు.. అమ్మా పురందేశ్వరీ! ఒక్క క్షణం ఆలోచించమ్మా’ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ గారు ఎంతో అభిమానించిన అబిడ్స్ ఇల్లు తన వాటాగా అందుకున్న నందమూరి రామకృష్ణ దానిని అమ్ముకున్నారని గుర్తుచేశారు. కేవలం నాలుగు కోట్లకు దానిని విజయ్ ఎలక్ట్రికల్స్ రమేశ్ కు అమ్ముకున్నారు.. వీళ్ల దగ్గర నాలుగు కోట్లు కూడా లేవా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ అంటే అభిమానం ఉన్న చంద్రబాబు కానీ, పురంధీశ్వరి కానీ ఆ ఇంటిని కొని ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా తీర్చిదిద్దలేదేమని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

మద్రాస్ లోని ఎన్టీఆర్ ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆ మహా నటుడి మీద మీకున్న ప్రేమ ఏంటనేది తెలుస్తుందని విమర్శించారు. వాటాలు తేల్చుకోలేక దానిని పాడు పెట్టేశారని మండిపడ్డారు. బంజారాహిల్స్ లో ఆయన చివరి క్షణాలు గడిపిన ఇంటిని పడగొట్టి అపార్ట్మెంట్ లు కట్టుకుని అద్దెకిచ్చారని ఆరోపించారు. దానికి ఎదురుగా ఉన్న మరో ఇంట్లో మ్యూజియం పెట్టాలని ఎన్టీఆర్ భావించగా.. ఆయన ఆశయాన్ని గౌరవించి, దానిని మ్యూజియంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీకు లేదా? అని ప్రశ్నించారు. సమాధి తప్ప ఆయనకు స్మారకచిహ్నం కూడా లేకుండా చేసి ఇప్పుడు 100 రూపాయల నాణెం అంటూ మురిసిపోతున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు.

తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో నుంచి, అంతరంగంలో నుంచి రావాలే కానీ పేపర్లు, టీవీల్లో కాదు చెల్లెమ్మా! అంటూ సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ ఏనాడూ ఢిల్లీలో డిమాండ్ వినిపించలేదు కానీ పూర్వాశ్రమంలో మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన మీ మాజీ బాస్ సోనియా గాంధీకి ఇప్పుడు చెబుతున్న హృదయపూర్వక కృతఙ్ఞతలు మరచిపోలేమమ్మా! అంటూ పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

ఢిల్లీ సాక్షిగా కుట్రలు చేయడం మీ మరిది గారికి అలవాటే: పురందేశ్వరిని ఉద్దేశిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్

  • జేపీ నడ్డాతో బాబు మాట్లాడుతున్న ఫోటోను ట్వీట్ చేసి పురందేశ్వరికి హెచ్చరిక!
  • పురందేశ్వరిని తీసుకెళ్ళి అమ్మే ప్రయత్నం చేయడం హైలైట్ అని ఎద్దేవా
  • మీరంతా ఒకటేనని బీజేపీకు తెలుసునని వ్యాఖ్య
Vijaya Sai Reddy tweet on Chandrababu meeting with JP Nadda

ఢిల్లీ సాక్షిగా కుట్రలు చేయడం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అలవాటేనని, ఈసారి మిమ్మల్ని అమ్మేసే ప్రయత్నాలు చేస్తున్నాడని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఢిల్లీలో ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫోటోలను ట్వీట్ చేస్తూ విజయసాయి విమర్శలు గుప్పించారు. ఇందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు మాట్లాడుతున్న ఫోటోను ట్వీట్ చేశారు.

ఢిల్లీ సాక్షిగా కుట్రలు చేయడం మీ మరిది గారికి అలవాటేనని పురందేశ్వరిని ఉద్దేశించి అన్నారు. కానీ ఈసారి మిమ్మల్ని తీసుకెళ్లి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు చూడండి… అదీ హైలైట్ అని పేర్కొన్నారు. చంద్రబాబు జీవితంలో ఎవ్వరికీ విశ్వసనీయమైన స్నేహితుడు కాలేడన్న కమ్మటి వాస్తవం ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరికీ తెలుసునన్నారు.

ఇంతకంటే ఆధారం కావాలా? చిన్నమ్మా! పురందేశ్వరి! పతీసమేతంగా మరిదిని తీసుకెళ్లి మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఇష్టంలేకపోయినా బలవంతంగా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి తెలీదా, మీరంతా ఒకటేనని, అందుకే కదా దొంగ చేతికే తాళం ఇచ్చిందని వ్యాఖ్యానించారు.

Related posts

నందికొట్కూరు ఇన్చార్జి బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి సీఎంవో నుంచి పిలుపు!

Ram Narayana

తన భార్య తనపై పోటీ చేస్తుండటంపై వైసీపీ అభ్యర్థి దువ్వాడ స్పందన…

Ram Narayana

వైసీపీకి రాజీనామా చేసిన గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ క్రిస్టినా…

Ram Narayana

Leave a Comment