Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బండి సంజయ్ కు పబ్లిక్ మీటింగ్స్ కమిటీకి చైర్మన్‌గా కొత్త భాద్యతలు ..

బండి సంజయ్ కు పబ్లిక్ మీటింగ్స్ కమిటీకి చైర్మన్‌గా కొత్త భాద్యతలు ..
ఆయన స్థాయి పెరిగినట్లా….? తగ్గినట్లా …??
14 కమిటీలను ఏర్పాటు చేసిన బీజేపీ నాయకత్వం
పబ్లిక్ మీటింగ్స్ కమిటీకి చైర్మన్‌గా బండి సంజయ్
వివేక్ వెంకటస్వామికి మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ బాధ్యతలు

తెలంగాణాలలో అధికారంలోకి వస్తామన్న బీజేపీ ఇప్పుడు పార్టీ పరువు ప్రతిష్టను కాపాడుకోవడమెలా అనే అంతర్మథనంలో పడింది.. బీజేపీలో ఎవరు ఉంటారు …ఎవరు బయటకు వెళతారో అర్థంకాక తలలు పట్టుకుంటుంది..దీంతో నాయకులను బుజ్జగించే పనిలో పడింది…గత కొన్ని రోజులుగా , వివేక్ వెంకటస్వామి , విజయశాంతి ,విశ్వేశ్వర్ రెడ్డి ,
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారు అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతున్నవేళ వారికీ వివిధ కమిటీల్లో కొత్త భాద్యతలు అప్పగించింది ..దీంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 కమిటీలను ఏర్పాటు చేసింది…బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కి పబ్లిక్ మీటింగ్స్ కమిటీకి చైర్మన్‌ గా బాధ్యతలు అప్పగించింది…దీంతో ఆయన స్థాయి పెరిగినట్లా ..? లేక తగ్గినట్లా …??అనే చర్చ జరుగుతుంది…

నిజామాబాద్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా సీఎం కేసీఆర్‌‌ పై విమర్శలు చేయడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. అదే జోరుతో అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికలే లక్ష్యంగా 14 కమిటీలను బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు చైర్మన్, కన్వీనర్లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పించిన బండి సంజయ్‌ కు కీలక బాధ్యతలు అప్పగించింది. పబ్లిక్ మీటింగ్స్ కమిటీకి చైర్మన్‌గా బండి సంజయ్ ను నియమించింది.

ఇక పార్టీని వీడుతారన్న వార్తల నడుమ ఎన్నికల మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా వివేక్ వెంకటస్వామికి బాధ్యతలు అప్పగించింది. కన్వీనర్‌‌ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్‌‌ గా కొండా విశ్వేశ్వర్ రెడ్డిలను నియమించింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చార్జిషీట్ కమిటీ ఛైర్మన్ గా మురళీధర్రావు, పోరాట కమిటీ ఛైర్మన్ గా విజయశాంతికి బాధ్యతలు అప్పగించింది. ఇక, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి బీజేపీ అగ్రనేతలు కీలక నేతలు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్ హాజరయ్యారు. ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా కౌన్సిల్ సమావేశం జరగనుంది.

Related posts

రేవంత్ రెడ్డీ ఇక్కడ భయపడేవాళ్లు లేరు… వెంట్రుక కూడా పీకలేవ్: కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

Ram Narayana

కాంగ్రెస్ వచ్చేది లేదు …చచ్చేదిలేదు ..భట్టి ముఖ్యమంత్రా …? మధిర సభలో కేసీఆర్ ఎద్దేవా.!

Ram Narayana

కేటీఆర్ దురహంకారి: మంత్రి సీతక్క ఆగ్రహం

Ram Narayana

Leave a Comment