Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

 ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద తనయుడి పెళ్లి కార్డు ఉంచిన షర్మిల… ఫొటోలు ఇవిగో!

  • త్వరలో షర్మిల తనయుడి పెళ్లి
  • వచ్చే నెల 17న రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహం
  • తండ్రి సమాధి వద్ద పెళ్లి కార్డు ఉంచి ఆశీస్సులందుకున్న షర్మిల
Sharmila visits YSR Ghat in Idupulapaya

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంట త్వరలో శుభకార్యం జరగనుంది. షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల కుమారుడు రాజారెడ్డి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రాజారెడ్డి పెళ్లి ఫిబ్రవరి 17న అట్లూరి ప్రియతో జరగనుంది. ఈ నేపథ్యంలో, షర్మిల నేటి సాయంత్రం తనయుడు రాజారెడ్డి, కాబోయే కోడలు అట్లూరి ప్రియతో కలిసి ఇడుపులపాయ చేరుకున్నారు. అక్కడ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించారు. తనయుడి పెళ్లి పత్రికను తండ్రి సమాధి వద్ద ఉంచిన షర్మిల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారితో వైఎస్ విజయమ్మ కూడా ఉన్నారు.

Related posts

ములుగు కేంద్రంగా భూకంపం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు!

Ram Narayana

రెండు గంటల్లో శ్రీవారి దర్శనం… ఏఐ టెక్నాలజీని పరిశీలించిన టీటీడీ సభ్యులు…

Ram Narayana

బీజేపీ ఆశలకు చిరంజీవి నీళ్లు పోశారా…?

Ram Narayana

Leave a Comment