తెలుగు రాష్ట్రాలు

 ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద తనయుడి పెళ్లి కార్డు ఉంచిన షర్మిల… ఫొటోలు ఇవిగో!

  • త్వరలో షర్మిల తనయుడి పెళ్లి
  • వచ్చే నెల 17న రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహం
  • తండ్రి సమాధి వద్ద పెళ్లి కార్డు ఉంచి ఆశీస్సులందుకున్న షర్మిల
Sharmila visits YSR Ghat in Idupulapaya

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంట త్వరలో శుభకార్యం జరగనుంది. షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల కుమారుడు రాజారెడ్డి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రాజారెడ్డి పెళ్లి ఫిబ్రవరి 17న అట్లూరి ప్రియతో జరగనుంది. ఈ నేపథ్యంలో, షర్మిల నేటి సాయంత్రం తనయుడు రాజారెడ్డి, కాబోయే కోడలు అట్లూరి ప్రియతో కలిసి ఇడుపులపాయ చేరుకున్నారు. అక్కడ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించారు. తనయుడి పెళ్లి పత్రికను తండ్రి సమాధి వద్ద ఉంచిన షర్మిల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారితో వైఎస్ విజయమ్మ కూడా ఉన్నారు.

Related posts

టీవీ న‌టుడు లోబోకు జైలు శిక్ష‌..!

Ram Narayana

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీ ప్రమాదం .. 4 కి.మీ మేర ట్రాఫిక్ జామ్…

Ram Narayana

తెలుగు రాష్ట్రాల్లో విషాదం … 9 మంది జలసమాధి

Ram Narayana