Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం

  • కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన విడుదల
  • ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటన
  • ఇటీవలే ఏపీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజు
  • రుద్రరాజుకు వర్కింగ్ కమిటీలో స్థానం కల్పించిన హైకమాండ్

అనుకున్నదే జరిగింది! వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. 

అంతేకాదు, షర్మిలకు మార్గం సుగమం చేస్తూ, ఇటీవల ఏపీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజుపై కాంగ్రెస్ హైకమాండ్ ఉదారంగా స్పందించింది. ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. 

ఇక, ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల రాక వెనుక చాలా జరిగింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతో షర్మిల తన పార్టీని ఎన్నికల బరికి దూరంగా ఉంచారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. 

తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో, షర్మిల త్యాగాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం గుర్తించింది. ప్రతిఫలంగా ఆమెకు ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగిస్తారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేయడంతో, షర్మిల నియామకం లాంఛనమేనని తెలిసిపోయింది. ఈ క్రమంలో, షర్మిల నియామకంపై కాంగ్రెస్ పార్టీ నుంచి నేడు అధికారిక ప్రకటన వెలువడింది.  

పీసీసీ చీఫ్ పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు: షర్మిల

  • ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం
  • కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకొస్తానని ప్రకటన
  • ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడితో కలిసి పనిచేస్తానని వెల్లడి
Sharmila responds on being appointed as AP PCC Chief

వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించి, తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల అనూహ్య రీతిలో ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయ్యారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా బరిలో దిగకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ విజయం సాధించడం, షర్మిల కాంగ్రెస్ లో చేరడం, తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం తెలిసిందే. ఇవాళ, షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. దీనిపై షర్మిల స్పందించారు.

“ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచిన ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం అందించేలా పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో, విధేయతతో పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. ఈ సందర్భంగా నేను మాణికం ఠాగూర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 

ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడితో కలిసి చేయి చేయి కలిపి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అంతేకాదు, మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు గారు, రాష్ట్రంలోని ఇతర కాంగ్రెస్ నేతలందరి మద్దతును కోరుకుంటున్నాను. వారందరి సహకారంతో నిర్దేశిత లక్ష్యాలను అందుకునేలా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను” అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

Related posts

సీఎం జగన్ కు లీగల్ నోటీసులు పంపిన పురందేశ్వరి

Ram Narayana

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు

Ram Narayana

చంద్రబాబు వస్తే వాలంటీర్ వ్యవస్థకు మంగళం…సజ్జల

Ram Narayana

Leave a Comment