ఖమ్మం వార్తలు

పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డిని గెలిపించాలని వద్దిరాజు విస్త్రత ప్రచారం …

శాసనమండలికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో నల్లగొండ -ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ భద్రాచలం, ఇల్లందు , మణుగూరులలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో శుక్రవారం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు…పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పట్టభద్రులు హాజరయ్యారు.రాకేష్ రెడ్డిని గెలిపించాలని బీఆర్ యస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని వద్దిరాజు పేర్కొన్నారు …మంచి వ్యక్తి , పట్టభద్రుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకోని పోయే సమర్థుడైన వ్యక్తిని మండలికి ఎన్నుకోవాలని ఆయన కోరారు …ఇల్లందు లో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, దిండిగల రాజేందర్ , తదితరులు పాల్గొన్నారు ..మణుగూరు లో మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ యస్ అధ్యక్షులు రేగా కాంతారావు తదితరులు పాల్గొన్నారు …

Related posts

జాతీయ రహదారుల అభివృద్ధికి తక్షణ చర్యలు అవసరం…సీఎం రేవంత్ ని కోరిన మంత్రి తుమ్మల

Ram Narayana

మంత్రి పువ్వాడ అజయ్ వాహనంలో ఎన్నికల అధికారుల తనిఖీలు

Ram Narayana

అభివృద్ధి కార్యక్రమాలను వేగిరపరచాలి ….కలెక్టర్ కు మంత్రి పొంగులేటి సూచన

Ram Narayana