Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలుప్రమాదాలు ...

ఢిల్లీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 7గురు నవజాత శిశువుల దుర్మరణం…

  • వివేక్ నగర్‌లోని న్యూబార్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో శనివారం ప్రమాదం
  • ఆరుగురు చిన్నారుల మృతి, మరో ఆరుగురికి ఆసుపత్రిలో చికిత్స
  • ఆసుపత్రితో పాటు పక్కనే ఉన్న రెసిడెన్షియల్ భవనంలో కూడా మంటలు

ఢిల్లీలోని ఓ చిన్నారుల ఆసుపత్రిలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 7గురు నవజాత శిశువులు మృతిచెందారు. వివేక్ నగర్ లోని న్యూబార్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. మొత్తం 12 మంది చిన్నారులను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొచ్చామని ఢిల్లీ ఫైర్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. అయితే, వీరిలో ఆరుగురు మరణించగా మిగతా వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరికి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నారు. చిన్నారులకు ఈస్ట్ ఢిల్లీ అడ్వాన్స్ ఎన్ఐసీయూ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.

శనివారం రాత్రి 11.32 గంటలకు ఫైర్ కంట్రోల్ రూంకు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం గురించి తెలిసిందని పోలీసులు తెలిపారు. మొత్తం 16 ఫైర్ స్టేషన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయని పేర్కొన్నారు. ఆసుపత్రి భవనంతో పాటూ ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ లోని రెండు ఫ్లోర్లలో మంటలు రేగినట్టు చెప్పారు. ఇటీవల గుజరాత్ లోని రాజ్‌కోట్ నగరంలోని గేమ్ జోన్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో ఏకంగా 27 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Related posts

రాష్ట్రాల ఏర్పాటుకు ఇదే వేదికైంది.. పార్లమెంట్ పాత భవనంపై మోదీ

Ram Narayana

విమానం అయోధ్య వెళుతోంది… రామలక్ష్మణులు, సీత వేషాల్లో ఇండిగో సిబ్బంది!

Ram Narayana

గుజరాత్‌లో గర్బా నృత్యం చేస్తూ గుండెపోటుతో 10 మంది మృత్యువాత

Ram Narayana

Leave a Comment