Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జనరల్ వార్తలు ...

వయనాడుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. మంత్రి వీణాజార్జ్‌కు గాయాలు


ప్రకృతి బీభత్సం సృష్టించి వందలాది మందిని బలితీసుకున్న వయనాడ్‌కు వెళ్తుండగా కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో గాయపడిన ఆమె ప్రస్తుతం మంజేరిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నారు.

ఆమె ప్రయాణిస్తున్న కారు మంజేరిలో తొలుత ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఆపై ఓ ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనలో ఆమె ముఖం, చేతులకు స్వల్పంగా గాయాలయ్యాయి. కోలుకున్న అనంతరం ఆమె వయనాడ్ వెళ్లే అవకాశం ఉంది. 

ఈ ఘటనలో గాయపడిన ద్విచక్ర వాహనదారుడికి కూడా చికిత్స అందిస్తున్నారు. కాగా, కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 153కు చేరుకోగా, ఇంకా 98 మంది జాడ తెలియరాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Related posts

విశాఖ ఆర్కేబీచ్‌‌ తీరంలో విషపూరిత జెల్లీఫిష్‌.. మత్స్యసంపదకు పెనుముప్పు!

Ram Narayana

వాట్సాప్ ఛానెల్స్ చికాకును వదిలించుకోవడం ఎలాగంటే..!

Ram Narayana

నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీతో పీహెచ్‌డీ‌.. ఆశావహులకు యూజీసీ గుడ్‌న్యూస్!

Ram Narayana

Leave a Comment