ఆంధ్రప్రదేశ్

క్వాంటం రంగంలో ఏపీ సరికొత్త అధ్యాయం.. దేశంలోనే తొలి రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  • అమరావతిలో క్వాంటం నవశకం
  • తొలి టెస్ట్ బెడ్స్‌ను ప్రారంభించిన చంద్రబాబు
  • ఎస్ఆర్ఎం వర్సిటీ, మేధా టవర్స్‌లో రెండు టెస్ట్ బెడ్స్ ఏర్పాటు
  • క్వాంటం హార్డ్‌వేర్‌ను పరీక్షించి, సర్టిఫై చేసే సామర్థ్యం సాధించిన ఏపీ
  • ఈ సదుపాయం కలిగిన తొలి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదుపాయాలను మంగళవారం ప్రారంభించారు. ఈ ఆవిష్కరణతో క్వాంటం రంగంలో రాష్ట్రం కీలక ముందడుగు వేసినట్లయింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ‘1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ’తో పాటు, గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఉన్న ‘1క్యూ క్వాంటం ఫెసిలిటీ’ని సీఎం ప్రారంభించారు. ఈ రెండు కేంద్రాలు క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించే టెస్ట్ బెడ్స్‌గా పనిచేస్తాయి. మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ అత్యంత శీతల ఉష్ణోగ్రత వద్ద పనిచేసేలా వీటిని రూపొందించారు.

ఈ కొత్త సదుపాయాలతో అమరావతి క్వాంటం వ్యాలీకి ఇప్పుడు క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను పరీక్షించి, సర్టిఫై చేసే సామర్థ్యం లభించింది. క్వాంటం కంప్యూటర్ పరికరాలు తయారుచేసే కంపెనీలకు, పరిశోధకులకు, విద్యార్థులకు, నిపుణులకు ఈ టెస్ట్ బెడ్స్ ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్, డీఎస్టీ ప్రతినిధులు, వివిధ క్వాంటం కంపెనీల అధిపతులు, ఐఐటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు.

Related posts

జామ్ నగర్ నుంచి ద్వారకాకు కాలినడకన అనంత్ అంబానీ

Ram Narayana

రావణకాష్ఠంలా మణిపూర్.. మహిళా మంత్రి ఇంటికి నిప్పు…!

Drukpadam

సంక్షోభంలో గో ఫస్ట్ ఎయిర్ లైన్స్.. టికెట్ తీసుకున్న వారి పరిస్థితి ఏంటి?

Drukpadam