జాతీయ వార్తలు

ప్రశాంత్ కిశోర్ నిరాహారదీక్షను భగ్నం చేసిన పోలీసులు!

  • బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు
  • పరీక్షలు మళ్లీ నిర్వహించాలంటూ ప్రశాంత్ కిశోర్ నిరాహారదీక్ష
  • తెల్లవారుజామున దీక్షను భగ్నం చేసిన పోలీసులు

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో ఆయనను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. 

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరీక్షలను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలంటూ బీపీఎస్సీ అభ్యర్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వీరికి మద్దతుగా పాట్నాలోని గాంధీ మైదాన్ లో గత నాలుగు రోజులుగా ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహారదీక్షను చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. చట్ట విరుద్ధంగా నిరసన చేపట్టినందువల్ల ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిరసన ప్రదేశంలో గుమికూడిన అభ్యర్థులను అక్కడి నుంచి పంపించేశామని చెప్పారు.

Related posts

హర్యానాలో మద్యం షాపుపై కాల్పుల మోత.. హడలిపోయిన జనం…

Ram Narayana

మాకు ఇండియా ఫస్ట్ … కొందరికి మోదీ ఫస్ట్: శశిథరూర్ పై ఖర్గే ఫైర్

Ram Narayana

మణిపూర్ అల్లర్లపై కేంద్రం కఠిన చర్యలు…

Drukpadam