Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటన ఖరారు!

  • ఈ నెల 27న తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్, ఖర్గే
  • ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమంలో పాల్గొననున్న కాంగ్రెస్ అగ్ర నేతలు
  • రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందంటూ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 27న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలో నిర్వహించనున్న ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమంలో వీరు పాల్గొననున్నారు. 

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ లేఖ రాశారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పోరాడుతుందని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం విస్తృతమైన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.

Related posts

విశ్వనగరం హైద్రాబాద్ లో ఆసియా లోనే పెద్దదైన “సింధు హాస్పిటల్స్”…పార్థసారధిరెడ్డి

Ram Narayana

భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!

Ram Narayana

తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఎప్పుడో చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్!

Ram Narayana

Leave a Comment