Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు ఉ.10 గంటలకు ఆర్జిత సేవా టికెట్ల విడుదల..

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు ఉ.10 గంటలకు విడుదల..

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ఏపీఆర్ నెల కోటాను టీటీడీ శనివారం ఉదయం విడుదల చేయనుంది. ఈ టికెట్ల కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు..
లక్కీ డిప్‌లో ఎంపికైన వారికి టికెట్ల కేటాయింపు జరుగనుంది. అలాగే కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకరణ సేవా టికెట్లను ఈనెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. రూ.300 టికెట్లు ఈనెల 24వ తేదీన విడుదల కానున్నాయి. వృద్ధులు, వికలాంగులకు కల్పించే ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్ లైన్ కోటాను జనవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అలాగే జనవరి 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏప్రిల్ నెల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఏప్రిల్ నెలకు సంబంధించి గదుల కోటాను ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటనలో తెలిపింది. శ్రీవారి భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆర్జితసేవలు, దర్శనం టికెట్లు(Darshan Tickets) బుక్ చేసుకోవాలని సూచించింది.

Related posts

అమ్మా.. నన్ను క్షమించమ్మా: పవన్ కల్యాణ్ తల్లికి రోజా క్షమాపణ…

Drukpadam

జీవన్మృతులకు ఏపీలో ఇకపై అధికారికంగా అంత్యక్రియలు

Ram Narayana

ఏపీ ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ సీరియస్..జైలుకు పంపుతామని సీఎస్ కు హెచ్చరిక!

Drukpadam

Leave a Comment