ఎలక్షన్ కమిషన్ వార్తలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన రాష్ట్రపతి

  • ఢిల్లీలో కొనసాగుతున్న పోలింగ్
  • మొత్తం 70 స్థానాలకు ఒకే విడత ఎన్నికలు
  • పోలింగ్ బూత్ లకు క్యూ కట్టిన ప్రముఖులు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ప్రెసిడెంట్ ఎస్టేట్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ముర్ము ఓటేశారు. అలాగే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు పోలింగ్ బూత్ లకు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉండగా అన్నింటికీ ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 

ఇప్పటి వరకు ఓటేసిన ప్రముఖులు..

  • రాష్ట్రపతి ఎస్టేట్‌లో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము
  • కె.కమ్రాజ్ లేన్ లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠీ
  • రాజ్ నివాస్ మార్గ్ లో ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా
  • కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిశీ 
  • నిర్మాణ్ భవన్ లో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
  • తుగ్లక్ క్రెసెంట్ లో విదేశాంగ మంత్రి జైశంకర్, ఆయన అర్ధాంగి 
  • ఆనంద్ నికేతన్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కుటుంబం
  • జన్ పథ్ లో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్
  • న్యూఢిల్లీ నియోజకవర్గంలో మనీశ్ సిసోడియా దంపతులు

Related posts

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అనుమానాలు… ఆహ్వానించిన ఈసీ

Ram Narayana

ఓటర్లకు గుడ్ న్యూస్.. పోలింగ్ కేంద్రం బయటే మొబైల్ డిపాజిట్!

Ram Narayana

ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ… జానారెడ్డి నామినేషన్ తిరస్కరణ

Ram Narayana