క్రికెట్ వార్తలు

రోహిత్ శర్మ మరోసారి విఫలం ..అయిన భారత్ గెలుపు

  • నాగ్ పూర్ లో టీమిండియా × ఇంగ్లండ్
  • తొలి వన్డేలో  వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
  • రాణించిన గిల్, అయ్యర్, అక్షర్ పటేల్

ఇంగ్లండ్ తో తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్లతో విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 249 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 38.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా ఇన్నింగ్స్ లో శుభ్ మాన్ గిల్ 87, శ్రేయాస్ అయ్యర్ 59, అక్షర్ పటేల్ 52 పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకిమ్ మహ్మద్ 2, అదిల్ రషీద్ 2, ఆర్చర్ 1, బెతెల్ 1 వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు విఫలమైనప్పటికీ… మిడిలార్డర్ అండతో విజయం సాధ్యమైంది. యశస్వి జైస్వాల్ (15), రోహిత్ శర్మ (2), కేఎల్ రాహుల్ (2) విఫలమయ్యారు. 

ఈ విజయంతో 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 9న కటక్ లో జరగనుంది.

Related posts

పాక్ క్రికెట్‌లో భారీ మార్పులు .. అన్ని ఫార్మాట్లకు సల్మాన్ అలీ అఘా కెప్టెన్?

Ram Narayana

‘ఛాంపియన్స్ ట్రోఫీ’ కోసం పాక్ వెళ్లనంటున్న భారత్.. మరి ఐసీసీ ఏం చేయనుంది?

Ram Narayana

తన రికార్డు తానే బద్దలు కొట్టిన సన్ రైజర్స్… ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు…

Ram Narayana