క్రైమ్ వార్తలు

ఆ విద్యుత్ శాఖ ఏడీఈ ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైన

  • రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏడీఈ సతీశ్ రెడ్డి
  • హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో స్థిరాస్తులు గుర్తించిన ఏసీబీ
  • 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఖాళీ స్థలాలు, విల్లా, భవనాలు గుర్తించిన అధికారులు

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో లంచం తీసుకుంటూ పట్టుబడిన విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్ రెడ్డి ఆస్తులు రూ.100 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏడీఈ సతీశ్ రెడ్డి రూ.50 వేలు లంచం తీసుకుంటూ నిన్న ఏసీబీకి చిక్కాడు. దీంతో నిన్నటి నుండి ఆయన నివాసంలో, ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనకు రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.

హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఆయనకు స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఖాళీ స్థలాలు, ఒక విల్లా, భవనాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువనే రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అతని నివాసం నుండి బంగారం, నగదు, స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Related posts

ఆస్తిలో వాటా ఇవ్వలేదని తండ్రిని కారుతో ఢీకొట్టి చంపిన తనయుడు…

Ram Narayana

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి.. ఆరు చోట్ల గాయాలు

Ram Narayana

అనుమానాస్పద పరిస్థితులలో ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి!

Ram Narayana