Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

గాజాపై ఇజ్రాయెల్ దాడి .. 130 మందికిపైగా మృతి!

  • గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు
  • ఇటీవలే ముగిసిన కాల్పుల విరమణ తొలి ఒప్పందం
  • కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించేందుకు అంగీకరించని హమాస్

ఇజ్రాయెల్ – హమాస్‌ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గాజాపై టెల్‌అవీవ్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో 130 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో గాజాలోని హమాస్ లక్ష్యంగా ఐడీఎఫ్, ఐఎస్ఏ దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ తెలిపింది. 

కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించుటకు హమాస్ అంగీకరించని కారణంగా ఈ దాడులకు ఆదేశించినట్లు ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య ఇటీవల తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ చెరలో ఉన్న 30 మందికిపైగా బందీలను మిలిటెంట్ సంస్థ విడుదల చేయగా, ప్రతిగా 2వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. 

ఈ నేపథ్యంలోనే రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. అయితే, ఆ చర్చలు జరగలేదు. తొలి దశ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 వరకు కొనసాగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి ప్రతిపాదించగా, టెల్ అవీవ్ అంగీకరించింది. కానీ హమాస్ నిరాకరించింది. దీంతో హమాస్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ముందుగా గాజాకు వెళ్లే మానవతా సాయాన్ని అడ్డుకోవడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిపివేసింది. తాజాగా వైమానిక దాడి చేసింది.  

గాజాపై ఇజ్రాయెల్ దాడిపై అమెరికా రియాక్షన్ ఇదే!

Did Israel consult US before Gaza airstrikes White House responds
  • ఇజ్రాయెల్ తమకు ముందే సమాచారం ఇచ్చిందన్న వైట్ హౌస్
  • కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇదే భారీ దాడి
  • బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందంటూ ఇజ్రాయెల్ పై హమాస్ ఆగ్రహం

హమాస్ తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మళ్లీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు రెండో దశ చర్చలకు సిద్ధమవుతూనే గాజాపై బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే సోమవారం గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. బాంబుల వర్షం కురిపించింది. దీంతో గాజాలో సుమారు 200 మంది వరకు చనిపోయారని సమాచారం. దీనిపై హమాస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఉల్లంఘించిందని మండిపడింది.

ఈ దాడితో తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. గాజాపై దాడికి సంబంధించి నెతన్యాహు ప్రభుత్వం తమకు ముందస్తు సమాచారం ఇచ్చిందని తెలిపింది. తమను సంప్రదించాకే దాడి చేసిందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ తో పాటు అమెరికాను భయపెట్టాలని చూస్తున్న హమాస్ మిలిటెంట్లకు, హుతీలకు ఇదొక హెచ్చరిక అని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ చెప్పారు.

బందీలను విడిచిపెట్టాలని, గాజాను వదిలిపెట్టి వెళ్లాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హమాస్ ను హెచ్చరించారని గుర్తుచేశారు. అయితే, ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన హమాస్.. ప్రస్తుతం దాని ఫలితం అనుభవిస్తోందని పేర్కొన్నారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు, బందీల అప్పగింతకు హమాస్ అంగీకరించకపోవడం వల్లే గాజాపై దాడులు జరపాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వివరణ ఇచ్చారు.

Related posts

అమెరికాలోనూ బర్డ్ ఫ్లూ కలకలం…

Ram Narayana

299 మంది రోగులపై అత్యాచారం చేసిన సర్జన్.. ఫ్రాన్స్ లో దారుణం!

Ram Narayana

ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష!

Ram Narayana

Leave a Comment