Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

అడ్డగూడూర్ లాకప్ డెత్ కేసులో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు….

అడ్డగూడూర్ లాకప్ డెత్ కేసులో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు

ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం తో మరియమ్మలాకప్​ డెత్​ కేసు పురోగతి
ఖమ్మం వెళ్లి మరియమ్మ కుమారుడిని పరామర్శించిన డీజీపీ మహేందర్ రెడ్డి
ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల నుంచి ఆరా
అన్ని విధాలా అండగా ఉంటామని హామీ

రాష్ట్రంలో సంచలనంగా మరీనా దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది . ఒక దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను దారుణాతి దారుణంగా కొట్టి హింసించి ఆమె మరణానికి పోలీసులు కారకులైయ్యారు . దీనిపై కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క ఆధ్వరంలో ఒక ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి జరిగిన సంఘటన గురించి వివరించి ,మరియమ్మ లాకప్ డీతఁ పై విచారం జరిపించి భాద్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని , కుటుంబానికి న్యాయం చేయాలనీ కోరింది . సంఘటన గురించి తెలుసుకున్న సీఎం పోలిసుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కుటుంబసభ్యులకు ఉద్యోగం , ఎక్స్ గ్రేషియా ప్రకటించి , స్వయంగా వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి రావాలని రాష్ట్ర డీజీపీ ని ఆదేశించిన సంగతి తెలిసింది . కేసీఆర్ ఆదేశాలమేరకు డీజీపీ ఖమ్మం చేరుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ తోపాటు పోలిసుల లాఠీలకు గురైన కుమారుడు ఉదయ్ కిరణ్ ను పరామర్శించారు.

లాకప్ డెత్ మృతురాలు మరియమ్మ కుమారుడిని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఆదివారం హెలికాప్టర్ లో ఖమ్మం వెళ్లిన ఆయన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ ను కలిసి ఘటనపై ఆరా తీశారు. ఓ దొంగతనం కేసులో అడ్డగూడూరు పోలీసులు మరియమ్మ, ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్, ఆమె కూతురును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే, మరియమ్మ పోలీస్ స్టేషన్ లో చనిపోవడంతో ఆ ఘటన వివాదాస్పదమైంది. పోలీసులు కొట్టడం వల్లే తమ తల్లి చనిపోయిందని ఆమె పిల్లలు ఆరోపించారు. రాజకీయ పార్టీలు ఆందోళనలు చేశాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మరియమ్మ కుటుంబానికి రూ.15 లక్షల సాయం, ఆమె కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగాన్నిస్తున్నట్టు ప్రకటించారు. అంతేగాకుండా దళితులపై దాడులు జరగకుండా చూడాలంటూ డీజీపీని ఆదేశించారు.

దీంతో డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా ఆదివారం ఖమ్మం వెళ్లి ఘటనపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. విచారణ చేసేటప్పుడు ఎంత మంది కొట్టారని ఉదయ్ కిరణ్ ను అడిగి తెలుసుకున్నారు. దీంతో ఉదయ్ కన్నీరుమున్నీరయ్యాడు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని డీజీపీ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఘటనకు కారకులైన పోలీసులను సస్పెండ్ చేశామన్నారు. మరియమ్మ ఘటన బాధాకరమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ తేల్చి చెప్పారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, విచారణ అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

Related posts

నా చెల్లెల్ని కూడా పెళ్లాడితేనే మన పెళ్లి జరుగుతుంది’ ఓకే అన్న యువకుడు

Drukpadam

తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద నిరసన … అడ్డుకున్న పోలీసులు…

Drukpadam

బుర్కినా ఫాసోలో దారుణం.. మిలటరీ యూనిఫాంలో గ్రామంలోకి చొరబడి 60 మంది కాల్చివేత…

Drukpadam

Leave a Comment