జాతీయ వార్తలు

ద్వంద్వ పౌరసత్వం… రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు…

  • కేసు నమోదు చేసి విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు
  • యూపీ ప్రభుత్వమే స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేయాలని సూచన
  • లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలన్న అలహాబాద్ హైకోర్టు

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందన్న ఆరోపణలపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఉత్తర్వులిచ్చింది. ఈ కేసు దర్యాప్తును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని సూచించింది. లేదంటే ఒక కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పేర్కొంది.

రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న తన అభ్యర్థనను లక్నోలోని ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ఈ సంవత్సరం జనవరి 28న తిరస్కరించడంతో, బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ అప్పీలు చేశారు. దీంతో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఈ ఉత్తర్వులు ఇచ్చింది.

రాహుల్ గాంధీ పౌరసత్వం అంశంపై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని, భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్‌లో నమోదైన ఓ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్‌గా, సెక్రటరీగా ఉన్నారని సుబ్రహ్మణ్యస్వామి చెబుతున్నారు.

ఆ కంపెనీ వార్షిక నివేదికలోనూ తనను తాను బ్రిటిష్ పౌరుడిగా రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. వేరే దేశంలో పౌరుడిగా ఉన్న వ్యక్తి ఆ దేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందని అన్నారు. లేదంటే చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. ఈ అంశంపై సుబ్రహ్మణ్యస్వామి గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.

Related posts

2 వేల నోటు మార్పిడికి గడువు మరో 5 రోజులే..!

Ram Narayana

కమలం పార్టీకి మహిళా సారథి .. రేసులో పురందేశ్వరి, నిర్మల, వానతి శ్రీనివాసన్

Ram Narayana

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పొత్తు?

Drukpadam