Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

పారిస్ ఒలింపిక్స్ లో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత పురుషుల ఆర్చరీ టీమ్..


భారత పురుషుల ఆర్చరీ జట్టు అదరగొట్టింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో నేరుగా క్వార్టర్-ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించింది. ప్యారిస్‌లోని ఎప్లానేడ్ డెస్ ఇన్వాలిడ్స్‌లో జరిగిన ర్యాంకింగ్ రౌండ్‌లో భారత ఆర్చర్లు ఆరంభంలో తడబాటుకు గురైనప్పటికీ… పుంజుకొని చివరకు టాప్-4లో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు.

ఆర్చర్లు బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌ అదరగొట్టారు. మొత్తం 2013 పాయింట్లు సంపాదించారు. 681 పాయింట్లు సంపాదించిన ధీరజ్ భారత జట్టుని టాప్-4లో నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అత్యుత్తమంగా రాణించి వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో నాలుగవ స్థానంలో నిలిచాడు.

కాగా భారత్ జట్టు మూడవ స్థానంలో నిలవడంతో క్వార్టర్ ఫైనల్ రౌండ్‌లో టర్కీ లేదా కొలంబియాతో భారత జట్టు తలపడనుంది. భారత జట్టు సెమీ ఫైనల్‌ కు చేరుకొని అక్కడ దక్షిణ కొరియా జట్టు ఎదురుకాకుంటే టాప్-2లో నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Related posts

బ్రిటన్ నూతన ప్రధాని కీర్ స్టార్మర్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ!

Ram Narayana

ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించనున్న మాల్దీవులు…

Ram Narayana

అమెరికాలో తెలుగు యువతి అదృశ్యం!

Ram Narayana

Leave a Comment