Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

మూసీ పునర్జీవం అధ్యయనానికి మంత్రులు పొంగులేటి, పొన్నం దక్షణ కొరియా పర్యటన

ఈ నెల 21 నుంచి దక్షిణ కొరియా పర్యటనకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు

  • మూసీ పునరుజ్జీవంపై అధ్యయనానికి సియోల్ పర్యటన
  • ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు పర్యటన
  • సియోల్ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని పరిశీలించనున్న బృందం

మూసీ పునరుజ్జీవంపై అధ్యయనానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు త్వరలో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు వారు సియోల్‌లో పర్యటిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులు కూడా పర్యటించనున్నారు. సియోల్‌లో రివర్ ఫ్రంట్ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.

ఈ పర్యటనకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, 12 మంది ఎమ్మెల్యేలు,  మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్‌తో పాటు మరో ఆరుగురు అధికారులు కూడా వెళ్లనున్నారు.

Related posts

యశోద ఆసుపత్రిలో కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్

Ram Narayana

సింగరేణి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో ప్రమాదం.. ఇద్దరు కార్మికుల సజీవ దహనం

Ram Narayana

సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత కేంద్రానిది…కిషన్ రెడ్డి

Ram Narayana

Leave a Comment