ఆంధ్రప్రదేశ్

కదులుతున్న రైల్లో దోపిడీ .. పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దొంగల బీభత్సం

  • ముగ్గురు మహిళల నుంచి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
  • కావలి సమీపంలో మూడు బోగీల్లోని ప్రయాణికులకు చుక్కలు
  • సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఘటన
  • రైల్వే పోలీసులకు బాధితుల ఫిర్యాదు, దర్యాప్తు ముమ్మరం

సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నెల్లూరు జిల్లా కావలి-శ్రీవెంకటేశ్వర పాలెం మధ్య ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పద్మావతి ఎక్స్‌ప్రెస్ తిరుపతికి బయలుదేరింది. మార్గమధ్యంలో, కావలి దాటి శ్రీవెంకటేశ్వర పాలెం సమీపంలోకి రాగానే, గుర్తుతెలియని దుండగులు రైలులోని మూడు బోగీల్లోకి ప్రవేశించారు. నిద్రపోతున్న ముగ్గురు మహిళా ప్రయాణికుల మెడలోంచి సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలు లాక్కెళ్లారు. వారి వద్ద ఉన్న రూ.20,000 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను కూడా అపహరించారు. తెల్లవారుజామున జరిగిన ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దోపిడీ అనంతరం దొంగలు రైలు నుంచి దూకి పరారైనట్లు తెలుస్తోంది. బాధితులు వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ముమ్మరం చేశారు.

Related posts

అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అతి తీవ్ర తుపాను

Drukpadam

నన్ను చాలామంది మోసం చేశారు: యాంకర్ ఝాన్సీ

Drukpadam

బ్రిటన్ రాజు పట్టాభిషేకానికి రూ.1,020 కోట్లు ఖర్చు

Drukpadam