Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఇండియా సహా బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్!

  • డాలర్‌ను దూరం పెట్టారంటే పన్నులు 100% పెంచుతామని అల్టిమేటం
  • అమెరికాకు ఎగుమతులు చేయలేరని హెచ్చరిక
  • అంతర్జాతీయ లావాదేవీలకు డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదని వెల్లడి

అంతర్జాతీయ వర్తకంలో డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. డాలర్‌ను దూరంపెట్టే ప్రయత్నాలు చేసే దేశాలు అమెరికాతో వర్తకానికి కూడా దూరం కావాల్సిందేనని హెచ్చరించారు. ఈ మేరకు బ్రిక్స్ దేశాలు ఇండియా, బ్రెజిల్, చైనా, రష్యా, సౌతాఫ్రికాలకు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ లావాదేవీలకు డాలర్ స్థానంలో మరో కరెన్సీ వాడాలని ఇటీవల బ్రిక్స్ దేశాలు నిర్ణయించాయి. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. డాలర్ స్థానంలో వేరే కరెన్సీని ఉపయోగించే దేశాలపై పన్నులు పెంచుతామని చెప్పారు. అమెరికాకు ఆయా దేశాలు ఉత్పత్తి చేసే వస్తువులపై పన్నులు 100 శాతం పెంచుతామని స్పష్టం చేశారు.

బ్రిక్స్ దేశాల ప్రయత్నాలను తాము ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటామని, డాలర్‌కు దూరంగా జరిగే దేశాలకు అమెరికా ఆర్థిక వ్యవస్థలో చోటుండదని హెచ్చరించారు. అమెరికాకు ఎగుమతుల విషయం మర్చిపోవాల్సి వస్తుందని వివరించారు. కాగా, అక్టోబర్‌లో రష్యాలోని కజన్‌లో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో అంతర్జాతీయ లావాదేవీలలో డాలర్‌కు బదులుగా స్థానిక కరెన్సీ వాడాలని నిర్ణయించాయి. దీనివల్ల స్థానిక కరెన్సీ బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డాయి. ఈ సమావేశంలో ఈజిప్ట్, ఇరాన్, యూఏఈ ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపాయి. ఈ మేరకు ఓ డిక్లరేషన్‌పై బ్రిక్స్ దేశాలు సంతకం చేశాయి. దీనిపై తాజాగా ట్రంప్ స్పందిస్తూ ఇండియా సహా బ్రిక్స్ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.

Related posts

పారిస్ ఒలింపిక్స్ లో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత పురుషుల ఆర్చరీ టీమ్..

Ram Narayana

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రపంచ ప్రముఖులు

Ram Narayana

భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం… క్రికెట్ స్టేడియం కంటే పెద్దదంటున్న ఇస్రో చీఫ్

Ram Narayana

Leave a Comment