ప్రమాదాలు ...

ఘోర ప్రమాదం .. అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్‌ ఇండియా విమానం

గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ (Ahmedabad)లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మేఘానిలో ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్‌ అయిన నిమిషాల్లోనే సివిల్‌ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై (Residential Area) విమానం కూలినట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రమాద సమయంలో విమానంలో 133 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం అనంతరం ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. విమానం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం.. పైలట్ దుర్మరణం

Ram Narayana

ఆ వార్త‌ల్లో నిజం లేదు .. బ్లాక్ బాక్స్ ఇంకా లభ్యం కాలేదు: ఎయిర్ ఇండియా

Ram Narayana

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం… కారు కాల్వలో పడి ఏడుగురి మృతి!

Ram Narayana