జాతీయ వార్తలు

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ముందు ‘పాన్ పాన్ పాన్’ అంటూ అత్యవసర సిగ్నల్ ఇచ్చిన ఇండిగో పైలట్!

  • ఢిల్లీ నుంచి గోవాకు బయలుదేరిన విమానం
  • భువనేశ్వర్ మీదుగా వెళ్తున్న సమయంలో సాంకేతిక సమస్య
  • విమానాన్ని ముంబైకి మళ్లించమని పైలట్ అభ్యర్థన
  • ఆ సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు

ఢిల్లీ నుంచి గోవా వెళుతున్న ఇండిగో విమానం గత రాత్రి ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు తెలిసింది. ఈ ఘటన సమయంలో విమానం భువనేశ్వర్‌కు ఉత్తరంగా సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో ఎగురుతున్నట్టు అధికారులు తెలిపారు. ఆ సమయంలో పైలట్ ‘పాన్ పాన్ పాన్’ అని పేర్కొన్నాడు. ఇది ఒక అంతర్జాతీయ రేడియో డిస్ట్రెస్ సిగ్నల్. ఇది ప్రాణాంతకం కాని అత్యవసర పరిస్థితిని సూచిస్తుంది. రాత్రి 9:32 గంటల సమయంలో ముంబైకి మళ్లించమని అభ్యర్థించాడు.

ఇండిగోకు చెందిన ఈ ఎయిర్‌బస్ ఏ320 నియోలో ఆ సమయంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. ‘ఇంజన్ నంబర్ 1లో సమస్య ఏర్పడిన కారణంగా పైలట్ ‘పాన్ పాన్ పాన్’ అని ప్రకటించాడు’ అని ఒక అధికారి తెలిపారు. ఈ సంఘటన రాత్రి 9:27 గంటల సమయంలో జరగ్గా, రాత్రి 9:53 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Related posts

మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది.. స్టాలిన్ సంచలన ఆరోపణలు..

Drukpadam

పోర్చుగల్ వెళ్లే ప్రయత్నం.. లిబియాలో కిడ్నాపైన గుజరాత్ కుటుంబం

Ram Narayana

గంగానది నీటిలో అధిక స్థాయిలో బ్యాక్టీరియా..

Ram Narayana