అంతర్జాతీయం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. 22 మంది మృతి

  • మైన్ రాష్ట్రంలోని లెవిస్టన్ నగరంలో బుధవారం రాత్రి ఘటన
  • ఓ బౌలింగ్ యాలీ, మరో బార్ అండ్ రెస్టారెంట్‌లో ఆగంతుకుడి కాల్పులు
  • సెమీ ఆటోమేటిక్ ఆయుధంతో కాల్పులకు తెగబడటంతో 22 మంది మృత్యువాత
  • నిందితుడి కోసం పోలీసుల విస్తృత గాలింపు

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. మైన్ రాష్ట్రంలోని లెవిస్టన్ నగరంలో బుధవారం రాత్రి ఓ ఆగంతుకుడు కాల్పులకు తెగబడటంతో 22 మంది దుర్మరణం చెందారు. సెమీ ఆటోమేటిక్ తుపాకీతో నిందితుడు ఓ బౌలింగ్ యాలీ, మరో రెస్టారెంట్‌లో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనలో మరో 60 మంది గాయాల పాలయ్యారు.

ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అతడి ఫొటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ ప్రాంతంలోని వ్యాపారాలను మూసేయాలని పోలీసులు స్థానికులకు సూచించారు. కాగా, ఈ దారుణంపై మెయిన్ చట్టసభ సభ్యుడు జేరెడ్ గోల్డెన్ ‘ఎక్స్’ వేదికగా విచారం వ్యక్తం చేశారు. తాను భయభ్రాంతులకు లోనైనట్టు చెప్పుకొచ్చారు.

Related posts

విదేశాల్లో భారతీయులకు కష్టకాలం.. ప్రపంచవ్యాప్తంగా వలస వ్యతిరేక సెగ!

Ram Narayana

లండన్‌లో భారత రెస్టారెంట్‌కు పాక్ వేధింపులు.. 16 ఏళ్ల తర్వాత శాశ్వతంగా మూసివేత

Ram Narayana

ఎలాన్ మస్క్ కు షాక్… గ్రోక్ ను బ్లాక్ చేసిన రెండు దేశాలు…

Ram Narayana