Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

గాంధీ హాస్పటల్ వద్ద ఉద్రిక్తత బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్?

హైదరాబాద్ లోని గాంధీ ధవాఖానాలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజ‌య్‌, మాగంటి గోపీనాథ్‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్రంలో వైద్య‌, ఆరోగ్య సేవ‌ల‌పై అధ్య‌య‌నం చేసేందుకు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ క‌మిటీ స‌భ్యులు గాంధీ ఆసుప‌త్రిని ప‌రిశీలించేందుకు లోప‌లికి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించారు.

దీంతో పోలీసులు ఎమ్మెల్యే ల‌ను అడ్డుకున్నారు. కాగా, బీఆర్ఎస్ వేసిన క‌మిటీలో వైద్యులైన సంజ‌య్‌, రాజ‌య్య‌, మెతుకు ఆనంద్ స‌భ్యులుగా ఉన్నారు.

ఇక ఎమ్మెల్యేల అరెస్టుతో గాంధీ ఆసుప‌త్రి వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది…

Related posts

తెలంగాణ నేతల తీరుపై కేసీ వేణుగోపాల్ అసహనం ..ఇదేమి పద్దతి అంటూ క్లాస్

Ram Narayana

ఖమ్మం ఎంపీ నామ కృషి ఫలితం …ఉమ్మడి ఖమ్మం జిల్లా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు …

Ram Narayana

ఉగ్రగోదావరి …రెండవ ప్రమాద హెచ్చరిక జారీ!

Ram Narayana

Leave a Comment