Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌కు ఈడీ సమన్లు!


రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌కు కేంద్ర దర్యాఫ్తు సంస్థ నుంచి నోటీసులు వచ్చాయి. భూకేటాయింపులకు సంబంధించి ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 22 లేదా 23వ తేదీన అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది.

అమయ్ కుమార్ బీఆర్ యస్ ప్రభుత్వం కాలంలో కీలకమైన జిల్లాలకు కలెక్టర్ గా పనిచేశారు ..
మొదట్లో ఆయనకు మంచి పేరే ఉంది …పాలనాపరంగా నిర్ణయాలు వేగంగా తీసుకుంటారని అన్ని శాఖల మీద పట్టు ఉందని అభిప్రాయాలు ఉన్నాయి… తర్వాత కాలంలో ఆయన పాలకులు ఏది చెపితే అది గుడ్డిగా చేస్తున్నారనే విమర్శలను మూటగట్టుకున్నారు …కీలకమైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఆయన కనుసన్నల్లో అనేక భూబదలాయంపులు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ కలెక్టర్ కు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది …ఐఏఎస్ లో ఇది ఒక రకమైన వణుకు పుట్టిస్తుందనే చెప్పాలి …అయితే ఈడీ కక్షపూరితంగా కాకుండా నిజంగా తప్పులు జరిగి ఉంటె చర్యలు తీసుకోవాలి కానీ ప్రతి చిన్న విషయానికి పాలనలో జోక్యం చేసుకోవడం చేస్తే మంచిది కాదు …ఇలాంటివి ఇలానే కొనసాగితే అధికారులు పనిచేయడం ఇబ్బందికరంగా ఉంటుందని పలువురు ఐఏఎస్ లు అభిప్రాయపడుతున్నారు ..

Related posts

తెలంగాణలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఉత్తర్వుల జారీ

Ram Narayana

వరంగల్ ప్రీతి ఆత్మహత్య కేసు: నిందితుడు సైఫ్ ర్యాగింగ్ చేయడం నిజమే.. తేల్చిచెప్పిన కమిటీ

Ram Narayana

రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ, జాబ్ క్యాలెండర్‌పై ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క వివరణ…

Ram Narayana

Leave a Comment