Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నాం: ఖర్గే కీలక వ్యాఖ్యలు

  • ఖర్గే నివాసంలో కూటమి పార్టీల నేతల సమావేశం
  • ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయన్న ఖర్గే
  • మోదీ నైతికంగా ఓడిపోయారని వ్యాఖ్య

తమ ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఖర్గే నివాసంలో కూటమి పార్టీల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ… ఈ ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయన్నారు. నైతికంగా ప్రధాని ఓడిపోయారన్నారు. తమ కూటమిలోకి కొత్త పార్టీలు రావొచ్చునని ఆహ్వానించారు.

రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి ఐక్యంగా పోరాడిందన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాలనుకునే ఏ పార్టీ అయినా కూటమిలోకి రావొచ్చునన్నారు. ఈ ఫలితాలు తనకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ మోదీ ప్రజల అభీష్టాన్ని మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Related posts

వారణాసిలో మోడీతో తలపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్…!

Ram Narayana

అవినీతిపరులను వదిలేది లేదు… వారికి జైలు లేదా బెయిల్ రెండే ఆప్షన్స్: ప్రధాని మోదీ

Ram Narayana

ఇదేం న్యాయం… అయోధ్యలో కార్యక్రమం జరుగుతుంటే అసోంలో రాహుల్ గాంధీ గుడికి వెళ్లకూడదా?: షర్మిల 

Ram Narayana

Leave a Comment