గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండును ఈ నెల 23 వరకు పొడిగింపు సీఐడీ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో వంశీతో పాటు రిమాండ్ ఖైదీలుగా ఉన్న మరో తొమ్మిది మందిని బుధవారం సీఐడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పర్చారు. కాగా, సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా వంశీకి న్యాయ స్థానం మంగళవారం రిమాండును పొడిగించింది. ఈ నెల 22 వరకు రిమాండును పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
previous post
next post